Monday, April 29, 2024

BJP – పురందేశ్వరితో నాదెండ్ల మనోహర్ భేటీ… జనసేన మా మిత్ర పక్షమేనన్న బీజేపీ

విజయవాడ – ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కొద్ది సేపటికే పురందేశ్వరి-నాదెండ్ల భేటీ కావడం గమనార్హం.పొత్తుల నేపథ్యంలో పురందేశ్వరి – నాదెండ్ల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జనసేన-బీజేపీ మధ్య కొనసాగుతున్నట్లు ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈ భేటీపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. జనసేన మా మిత్ర పక్షమేనని, నాదెండ్లతో భేటీ మర్యాద పూర్వకమే అని ఆమె స్పష్టం చేశారు. శివప్రకాష్ జీని కలవడానికే మనోహర్ వచ్చారని ఆమె వెల్లడించారు.

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిని మీడియా స్పందన కోరింది. షర్మిల ఏ పార్టీలో చేరారన్నది తమకేమీ ముఖ్యమైన అంశం కాదని పురందేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలన్నదాని గురించే తాము ఆలోచిస్తామని అన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన విషయం తమకు సంబంధించినంత వరకు అప్రస్తుతం అని పేర్కొన్నారు

పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించామని పురందేశ్వరి చెప్పారు. పొత్తులపై మా అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తామన్నారు. పొత్తులపై అంతిమ నిర్ణయం మా అధిష్టానానిదేనని ఆమె వెల్లడించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement