Saturday, May 4, 2024

అమ‌రావ‌తి రాజ‌ధానికి బీజేపీ క‌ట్టుబ‌డి ఉంది.. జీవీఎల్

రాష్ట్ర రాజధానిగా అమరావతికి బీజేపీ కట్టుబడి ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు స్పష్టం చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… రాజకీయంగా తమ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లినప్పుడు తాము పోరాడుతామని తెలిపారు. ఆంధ్రాలో వైసీపీ పాలన అధోగతిలో ఉందని.. రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక శ్రద్ద పెట్టిందన్నారు. ఏపీలో బీజేపీ, జనసేన పొత్తుతో ఉందని.. తామే రాష్ట్రంలో ప్రత్యామ్నాయగా ఎదుగుతామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement