Thursday, April 25, 2024

AP : టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి సభకు భూమిపూజ..

ఏపీలో ఎల‌క్ష‌న్ వాతావ‌ర‌ణం కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే దాదాపు అన్ని పార్టీలు త‌మ ప్ర‌చారాల‌ను మొద‌లుపెట్టాయి. వైసీపీ సిద్ధంతో సిద్ధ‌మ‌వ్వ‌గా…. టీడీపీ-జ‌న‌సేన యుద్ధ‌మంటూ మొద‌లుపెట్టాయి. తాజాగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ-జ‌న‌సేన కూట‌మీ త‌మ తొలిస‌భ‌కు స‌న్నాహం చేస్తుంది. ఇందుకు గాను ఇవాళ స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్ల‌కు భూమి పూజ చేయ‌నుంది.

- Advertisement -

ఇక, ఈ నెల 17వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యటనను ఖరారు చేసింది. ఈ మేరకు 17న చిలకలూరిపేటలో తలపెట్టిన తెలుగుదేశం-బీజేపీ-జనసేన ఉమ్మడి సభకు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నారు. సభ ద్వారా ఒకే వేదికపైకి నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉండనున్నారు. దీంతో మూడు పార్టీలు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సభ నిర్వహణపై ఇప్పటికే ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement