Monday, April 29, 2024

AP: కూట‌మి స‌భా వేదిక‌కు భూమిపూజ‌..

పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఈనెల 17న జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ కూట‌మి భారీ బహిరంగ సభ నిర్వ‌హించ‌నుంది.. ఈ నేప‌థ్యంలో నేడు వేదిక వ‌ద్ద ప‌నుల‌కు భూమిపూజ నిర్వ‌హించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు మూడు పార్టీల నేతలు పాల్గొన్నారు.

అనంతరం ప్రాంగణాన్ని అచ్చెన్నాయుడు, భాజపా, జనసేన నేతలతో కలిసి లోకేష్ పరిశీలించారు. సభ నిర్వహణ కమిటీలతో ఏర్పాట్లపై చర్చించారు. లక్షలాదిగా ప్రజలు తరలిరానున్నారని.. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 2014 త‌ర్వాత తొలిసారిగా ఈ సభలో ప్రధాని నరేంద్రమోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఈ స‌భ‌ను మూడు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పొత్తు తర్వాత జరిగే తొలి సభ కావడంతో ఏర్పాట్లను లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement