Sunday, April 28, 2024

పసుపు జెండానే తన అజెండా: మాజీమంత్రి ఫారూఖ్ సేవలపై భూమా

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఫరూఖ్ సేవలను మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. పార్టీ ఆవిర్భావం నుండి పసుపు జెండా నీడలో పసుపుజెండానే తన అజెండా అంటూ తెలుగుదేశం పార్టీకి సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. టీడీపీ ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక కలీల్ థియేటర్ ప్రాంగణంలో మాజీమంత్రి ఫరూఖ్ కు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భూమా మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి ఎందరో మహానుభావులు పార్టీకోసం కష్ట పడి పనిచేసి తమ సొంత ఆస్తులు కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. మాజీమంత్రి ఫారూఖ్ తన తండ్రి మంచి స్నేహితులుగా వుంటూ ఒకేసారి టిడిపి పార్టీకి సేవలు అందించారని గుర్తు చేశారు. టీడీపీ జెండాతో తన తండ్రి భూమా వీరాశేఖర్రెడ్డి ఎంఎల్ఏ గా సేవలు అందించారన్నారు. యాదృచ్చికం అయినా తానుకుడా టిడిపి జండాతోనే నంద్యాల ఎంఎల్ఏగా గెలుపొందానన్నారు. 40 వసంతాలు పార్టీ నంద్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. నాడు బాబాయ్ భూమా నాగిరెడ్డి, మాజీమంత్రి ఫారూఖ్ పోటీపడి తెలుగుదేశం హయాంలో నంద్యాలలో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement