Sunday, April 28, 2024

ఈ నెల 9న మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి భూమి పూజ : గంగుల కమలాకర్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కోకాపేటలోని మున్నూరుకాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఈ నెల 9న భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. మున్నూరు కాపుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకు మున్నూరు కాపు సంఘాలన్ని ఏక సంఘంగా ఏర్పడాలన్నారు. ఆదివారం మంత్రి నివాసంలో భవన నిర్మాణానికి సంబంధించి భూమి పూజ అంశంపై కుల సంఘాల నాయకులతో మంత్రి చర్చించారు.

రాష్ట్రంలోని మున్నూరు కాపులందరు ఆత్మగౌరవ భవన భూమి పూజ కార్యక్రమానికి రావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మేయర్‌ బోంతు రామ్మోహన్‌, ఆ సంఘం నాయకులు మానికొండ వెంకటేశ్వర్లు, మంగళరావు, లక్ష్మణ్‌, కొండూరి వినోద్‌, సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement