Sunday, April 28, 2024

AP: ఎలుగుబంటి దాడి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి

(విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో) : విశాఖ జూపార్క్ లో ఇవాళ ఉదయం ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న నగేష్ అనే యువకుడు ఇవాళ ఉదయం జూ పార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని అతడు క్లీనింగ్ చేస్తుండగా సంఘటన సంభవించింది.

ఎలుగుబంటి బోనుకు వేసి ఉన్న తలుపులు ఎప్పుడు తెర్చుకున్నాయో, ఎవరు తెరిచి ఉంచారో తెలియాల్సి ఉంది. జూలో ఉన్న సందర్శకులు అందరూ చూస్తుండగానే ఈ ఎలుగుబంటి ఆ యువకుడిపై దాడి చేయడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనను గుర్తించిన జూ అధికారులు వెంటనే స్పందించి ఆ ఎలుగుబంటిని బంధించారు. తీవ్రగాయాల పాలైన ఆ ఉద్యోగి నగేష్ ను ఆసుపత్రికి తరలించగా.. అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సంఘటనతో జూలోని సందర్శకులు అంతా అయోమయానికి గురయ్యారు. జూలో సిబ్బందికి, సందర్శకులకు భద్రత కరువైందని ప్రజలు భావిస్తున్నారు. ఆరిలోవ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement