Friday, April 26, 2024

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బండ్ల గణేష్ కౌంటర్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మరోసారి టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్‌ ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీతో ఎల్లో మీడియా అధినేతలు కలిశారంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు.

“ఎల్లో మీడియా ముఖ్యులు తమ వ్యాపార విబేధాలను పక్కనపెట్టి ఏకమయ్యారు. రాధాకృష్ణ, TV5 నాయుడు, CVR సివి రావు, స్వయం ప్రకటిత మీడియా కింగ్ రవిప్రకాశ్ అర్థరాత్రి తాజ్ కృష్ణాలో రాహుల్ ను కలిశారు. ప్రధాని మోదీని ఎలా దింపొచ్చో క్షుద్ర వ్యూహాలతో బాబు కోసం ఈ దళారీ వ్యవహారాన్ని నడిపారు.” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీంతో ఆయనకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. “ఆచార్య హరగోపాల్, గద్దర్, ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం, కంచె ఐలయ్య, చెరుకు సుధాకర్, జహీర్ అలీ ఖాన్ గారు రాహుల్ గాంధీని కలిశారు సార్.. వారు కూడా ఎల్లో మీడియానేనా ? “అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement