Monday, April 29, 2024

Balakrishna: దుర్గమ్మ సేవలో ‘అఖండ’.. అమ్మవారి సాక్షిగా మల్టీస్టారర్‌కు రెడీ!

‘అఖండ’ సినిమా విజయంతో హీరో నందమూరి బాలకృష్ణ పుల్ జోష్ లో ఉన్నారు. సినిమా విజయంవంతం కావడంతో వరుసగా పలు ఆలయాల దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బాలయ్య.. తాజాగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు.

బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బాలయ్య అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రమేష్ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి బాలకృష్ణ సంప్రదాయ దుస్తులతో వచ్చారు. బాలయ్యకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలయ్య. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి చిత్రపటంతో పాటు వేద ఆశీర్వచనం అందించారు.

సనాతన ధర్మాన్ని చూపించిన సినిమా అఖండ అని అమ్మవారి ఆశీస్సులతో ప్రేక్షకులు విజయాన్ని అందించారని బాలకృష్ణ పేర్కొన్నారు. దర్శకులు ముందుకొచ్చి కథ నచ్చితే మల్టీస్టారర్‌ చేస్తానని ప్రకటించారు. “సినిమా కథ బాగుంటే ఖచ్చితంగా మల్టీస్టారర్ చేస్తాను. సరైన కాస్టింగ్ ను బట్టి నిర్ణయం తీసుకుంటాము. అంతా అమ్మవారు ఇచ్చిన ప్రేరణ… నేను మల్టీస్టారర్ చేయడానికి నేను ఎప్పుడూ కాదనలేదు. కానీ అవతలి వారికి ధైర్యం ఉండాలి కదా… నాకైతే ధైర్యం ఉంది. నేను మల్టీస్టారర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని బాలయ్య పేర్కొన్నారు.

కాగా, అఖండ సినిమా డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. బాలయ్య కేరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో సింహా, లెంజడ్ తర్వాత బోయపాటితో హ్యాట్రిక్ కొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement