Friday, May 17, 2024

సిబిఐతో ఎంపి అవినాష్ రెడ్డి దాగుడు మూత‌లు

అమరావతి, ఆంధ్రప్రభ:వైఎ స్‌ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి సీబిఐతో దోబూచులాడుతున్నారు. ఇప్పటికే ఆరు సార్లు విచారించిన సీబిఐ ఏడోసారి విచారణకు రావాలని సోమవారం నోటీసులు జారీ చేసింది. షార్ట్‌ నోటీసు అంటూ అప్పటికే ముందస్తు షెడ్యూలు ఉన్నందున రాలేనని లేఖ రాసిన అవినాష్‌ రెడ్డి మంగళవారం నాటి విచారణకు డుమ్మా కొట్టారు. తనకు నాలుగురోజులు గడువు కావాలని లేఖలో కోరిన మేరకు సానుకూలత వ్యక్తం చేసిన సీబిఐ ఈనెల 19వ తేదీన విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అయితే బుధవారం ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. ఉూహించని రీతిలో అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముందస్తు షెడ్యూలు ప్రకారం వివి ధ కార్యక్రమాలు ఉన్నాయని విచారణకు రాని అవినాష్‌ రెడ్డి హఠాత్తుగా సుప్రీం కోర్టుకెళ్ళడం అటు సీబిఐని ఆశ్చర్యానికి గురి చేయగా, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది.

అయితే ఇది ఇప్పుడేమీ కొత్తకాదని, ముందు నుంచీ సీబిఐ విచారణకు పిలిచిన ప్రతీసారి అవినాష్‌ రెడ్డి అనుసరిస్తున్న తీరేనని న్యాయవర్గాలు అంటున్నాయి. అంతకుముందు కూడా విచారణకు రావాలని పి లువగా వస్తున్నానంటూనే చివరి నిముషంలో తెలంగాణా హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పుడు కూడా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమై చివరిలో మనసు మార్చుకున్నారు. తనను అరెస్ట్‌ చేస్తారన్న అనుమానంతో హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వులు అందుకున్నారు. ఇది కొంత ఉూరట కలిగించినా ఆ తర్వాత క్రమంలో సుప్రీం కోర్టు వీటిని రద్దు చేయడంతో తిరిగి ముందస్తు బెయిల్‌పై తెలంగాణా హైకోర్టులో విచారణకు సిద్ధం కాగా, ఏటూ తేల్చని న్యాయస్ధానం జూన్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో సీబిఐని నిలువరించే ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో ఇక సీబిఐకి అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేసేందుకు న్యాయపరమైన అడ్డంకులు తొలిగాయి. ఇలా విచారణకు పిలిచిన ప్రతీసారి అవినాష్‌ రెడ్డి సహకరించడం లేదని ఇప్పటికే పలుమార్లు న్యాయస్ధానం దృష్టికి తీసుకువచ్చిన సీబిఐ అవసరమైతే కస్టడీకి తీసుకుని ప్ర శ్నిస్తామని స్పష్టం చేసింది. ఈ అనుమానంతో అవినాష్‌ రెడ్డి మంగళవారం నాటి విచారణకు రాకుండా గడువు కోరినట్లు కోరి బుధవారం సుప్రీం కోర్టు కె ళ్ళారు. అతని తరుఫు న్యాయవాది నిరంజన్‌ రెడ్డి చీఫ్‌ జస్టిస్‌ ముందు అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ గురించి మెన్షన్‌ చేశారు. అప్పటి వరకూ అవినాష్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారనే సంగతి ఎవరికీ తెలియదు.

దక్కని ఊరట..
వివేకా కేసులో సీబిఐ ఉన్న ఫలంగా స్పీడు పెంచడంతో అవినాష్‌ రెడ్డికి అరెస్టు భయం పట్టుకుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. విచారణకు రావాలని నోటీసు ఇవ్వగా గడువు కోరుతూ లేఖ రాశారు అవినాష్‌. అది కూడా విచారణకు వెళ్ళేందుకు సిద్ధమై చివరి నిముషంలో నిర్ణయం మార్చుకున్నారు. అయితే లేఖ పట్ల సీబిఐ సానుకూలంగా స్పందించి 19న రావాలని తెలిపింది. దీంతో పులివెందుల వెళ్ళిన అవినాష్‌కు సీబిఐ షాక్‌ ఇచ్చింది ఆయన కంటే ముందుగానే అక్కడకు చేరుకున్న బృందం నోటీసులిచ్చి వెనుదిరిగింది. దీంతో ఇక లాభం లేదనుకున్న అవినాష్‌ ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఉూరట లభించలేదు. పిటిషన్‌పై ధర్మాసనం ముందు మెన్షన్‌ చేసినా విచారణకు తేదీ ఇవ్వడానికి చీఫ్‌ జస్టిస్‌ నిరాకరించారు. విచారణ అత్యవసరం అయితే రాతపూర్వకంగా అభ్యర్ధన ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. అత్యవసరాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మెన్షనింగ్‌ జాబితా పరిశీలించకుండానే బ్యాచ్‌ల వారీగా తేదీలను కేటాయిస్తామని తెలిపింది. కాగా పిటిషన్‌పై విచారణ వేసవి సెలవుల్లో వెకేషన్‌ బెంచ్‌కు కేటాయించేదీ లేనిది సీజెఐ ధర్మాసనం నిర్ణయించనుంది. సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారణ జరుపుతుంది. ఇప్పుడు అత్యవసరంగా విచారణ జరపాలని అవినాష్‌రెడ్డి కోరే అవకాశం ఉంది. అయితే అవినాష్‌ ముందస్తు బెయిల్‌కు సంబంధించి ఇంతకుముందు తెలంగాణా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టే రద్దు చేస్తూ మరోసారి విచారణ జరపాలని ఆదేశాలిచ్చింది. ఇప్పుడు మళ్లీ ముందస్తు బెయిల్‌ కావాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల సీబిఐ తీవ్ర అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి.

అవినాష్‌ న్యాయవాది ఏమన్నారంటే..?
అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ దగ్గర లేవ ని, దస్తగిరి స్టేట్‌మెంట్‌ ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ఎంపీ తరుఫు పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం సీబీఐకి తగద ని, వివేకాను దస్తగిరి హత్య చేశాడు. అలాంటప్పుడు దస్తగిరి స్టేట్‌మెంట్‌ను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు. రెండు నెలల పాటు- సీబిఐ కస్టడీలో ఉన్న దస్తగిరికి ముగియగానే అప్రూవర్‌గా సీబీఐ మార్చిందని, దస్తగిరి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ ఎక్కడా అపోజ్‌ చేయలేదని, ముందుగానే ప్లాన్‌ చేసి దస్తగిరి చేత అవినాష్‌ రెడ్డి పేరు చెప్పేలా సీబీఐ ప్లాన్‌ చేసిందని పేర్కొన్నారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితుడికి బెయిల్‌ ఇవ్వడం నేను ఎక్కడా చూడలేదన్నారు. అవినాష్‌ను లక్ష్యంగా చేసుకుని సీబీఐ విచారణ చేస్తోంది. ఏ కోర్టులు గూగుల్‌ టేకౌట్‌ను ఆధారంగా పరిగణించవని, గూగుల్‌ టేకౌట్‌ ఎప్పుడూ కచ్చితమైన ప్రదేశాన్ని చూపించదని అన్నారు. అవినాష్‌ కోసం మా నాన్న ప్రచారం చేశారని సునీత చెప్పారు. ఇంకా ఇక్కడ హత్యకు మోటివ్‌ ఎక్కడుందని న్యాయవాది నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. కాగా దూసుకెళ్తున్న సీబిఐ విచారణలో కొత్త వ్యక్తులు తెర మీదకు రావడం, ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి రావడం పట్ల కీలక పరిణామాలుంటాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement