Monday, April 29, 2024

Breaking: మీడియాపై అవినాష్ రెడ్డి అనుచ‌రుల దాడి

క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. కవరేజ్ చేస్తున్న మీడియాపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. కెమెరా లాక్కొని మీడియా వాహనాలు ధ్వంసం చేశారు. అవినాష్ వాహనాన్ని అనుసరిస్తుండగా మీడియాపై దాడికి పాల్ప‌డ్డారు. ప్రముఖ మీడియా సిబ్బందిపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. రిపోర్టర్, కెమెరామెన్ పై అవినాష్ అనుచరులు పిడిగుద్దులు కురిపించారు. తీంతో రిపోర్ట‌ర్, కెమెరామెన్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అంత‌టితో ఆగ‌కుండా కెమెరా లాక్కుని పగులగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement