Thursday, April 18, 2024

కాజీపేటలో దారుణం.. వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి..

వరంగల్ క్రైమ్, మే 19 (ప్రభ న్యూస్) : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కాజీపేటలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కాజీపేట రైల్వే ఆవరణలోని నూతన చిల్డ్రన్ పార్క్ వద్ద ఆరు సంవత్సరాల బాలునిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. వీధి కుక్క ఆ బాలుడి మెడను పట్టుకోవడంతో గాయపడి రక్తస్త్రావమై చిన్నారి విలవిలాడి పోయాడు. బ‌తుకు దెరువు కోసమై ఉత్తరప్రదేశ్ కు చెందిన చోటు కుటుంబం వరంగల్ కు వచ్చింది. కాజీపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో రోడ్లపైనే ఉంటూ, వీధుల్లో చేతి ఉంగరాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. కుక్క కాటుకు మృత్యువాత పడ్డ అన్నను లేవమంటూ చిన్నారి చేస్తున్న రోదనలు చూపరుల కంటతడి పెట్టించాయి.

బ‌తుకు దేరువు కోసం వచ్చి కన్న కొడుకును పోగొట్టుకున్న వలస జీవి చోటు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దజాస్యామ్ వినయ్ భాస్కర్ కాళ్లపై పడి కన్నీరు మున్నీరుగా రోధించారు. సర్కార్ పక్షాన సహాయం చేస్తామని వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. వైద్యం కోసం ప్రయత్నించే క్రమంలోనే అప్పటి వరకు కళ్ల‌ ముందు ఆడుకొన్న బాలుడు మృతి చెందాడు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం కారణంగానే అభంశుభం తెలియని ఆరేళ్ల‌ బాలుడు కన్నుమూశాడని స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు. వరంగల్ లో కుక్కల స్వైర వివాహారం చేస్తూ, నగరంలో హల్ చల్ చేస్తున్న బల్దియా అధికారులు ఏం చేస్తున్నారని నగర వాసులు నిలదీస్తున్నారు. ఇప్పటి నుండైన చిన్నారులను ఒంటరిగా బయటకు వెళ్లకుండా చేసుకోవడంతో పాటు, శునకాలు సంచరించే ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement