Thursday, May 2, 2024

AP: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం అమృతలింగా నగరం సమీపంలో అలికాం-బత్తిలి ప్రధాన రహదారిపై ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ పుట్ట ప్రశాంత్ మృతి చెందాడు. సరుబుజ్జిలి వైపు నుండి ఎల్.ఎన్.పేట వైపు వస్తుండగా ఆటో అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆటో డ్రైవర్ ఎల్.ఎన్.పేట మండలం మోదుగు వలస నిర్వాసిత కాలనీకి చెందిన వ్యక్తి. మృతుడికి భార్య రాజులమ్మ, ఏడాదిన్నర బాబు ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement