Sunday, April 28, 2024

HYD: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీస్ ఉన్నతాధికారి

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి మానవత్వం చాటుకున్నారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఓ వ్య‌క్తి గుండెపోటుకు గురయ్యాడు. గుండెపోటుకు గురైన‌ వ్యక్తి ప్రాణాలను నార్త్ జోన్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ మధుసూదన్ రెడ్డి సీపీఆర్ చేసి నిలబెట్టారు. బేగంపేటలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో కిందపడిపోయాడు.

అదే సమయంలో నార్త్ జోన్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ మధుసూదన్ రెడ్డి అటుగా వెళ్తున్నారు. హుటాహుటిన ఆ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించారు. ఆనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. హోదాను పక్కన పెట్టి సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టిన పోలీస్ అధికారిని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement