Saturday, May 4, 2024

విషం తీసుకుని జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం – ఒక‌రి మృతి.. మ‌రోక‌రి ప‌రిస్థితి విష‌మం

మడకశిర జులై 21 ప్రభ న్యూస్ ) – శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో ని రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద గల కాంటాక్ట్ ఈశ్వరప్ప పాత భవనంలో ఇద్దరు వ్యక్తులు యువతి యువకులు పాయిజన్ తాగి అపస్మార్క స్థితిలో ఉన్నారు.. ఈ విషయం తెలుసుకున్న పట్టణవాసులు వారి పరిస్థితిని చూసి ఆసుపత్రికి తరలించడానికి ఎవరు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఏ ఎస్. ఐ కృష్ణారెడ్డి .. చూసిన వెంటనే మానవత్వంతో వారిని ప్రభుత్వాసుపత్రికి చేర్చడానికి స్వయంగా 108 వాహనానికి సమాచారం ఇచ్చి పిలిపించి మహిళ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే ఆమెను ముట్టుకోవడానికి కొంతమంది ముందుకు రాకపోవడంతో స్వయంగా ఎ ఎస్ ఐ కృష్ణారెడ్డి తానే దగ్గరుండి స్ట్రక్చర్ ద్వారా 108లోకి చేర్చి మహిళను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు.

.108 సిబ్బంది పైలెట్ తిమ్మప్ప .మంజుల కూడా ఉన్నారు. ఆసుపత్రికి చేర్చిన జంటలో యువకుడు మృతి చెందగా యువతి కొన ఊపిరితో ఉండ‌టంతో మెరుగైన చికిత్స కోసం హిందూపురం ఆసుపత్రికి ఓ హోంగార్డ్ సహాయంతో ఏఎస్ఐ కృష్ణారెడ్డి తరలించారు. ఏ ఎస్ ఐ అపస్మారక స్థితిలో ఉన్న యువతీ యువకులను మానవత్వంతో ఆసుపత్రికి తరలించడం పట్ల వెను వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం పట్ల పట్టణ ప్రజలు అభినందనలు తెలియజేశారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement