Tuesday, April 30, 2024

AP: జ‌ల‌వ‌న‌రుల‌శాఖ‌ ఏడీపై హత్యాయత్నం… భార్యే చేయించింద‌న్న‌ బాధితుడు…

శ్రీ సత్యసాయి బ్యూరో, జనవరి 18 (ప్రభ న్యూస్) : బుధ‌వారం రాత్రి జ‌ల వ‌న‌రుల‌శాఖ ఏడీ రాజ‌శేఖ‌ర్ రెడ్డిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. అయితే బాధితుడు రాజ‌శేఖ‌ర్ మాత్రం తనపై దాడికి త‌న భార్యే కారణమని, ఆమె కొంత మందితో క‌లిసి త‌న‌ను అంత‌మొందించాల‌ని ఈ హత్యాయత్నానికి ప్ర‌య‌త్నించార‌ని ఆరోపించాడు.

అయితే పోలీసుల క‌థ‌నం మేర‌కు.. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి 11గంటల సమయంలో జల వనరుల శాఖ ఏడీ రాజశేఖర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు పుట్టపర్తి పోలీసులు తెలిపారు. పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో రాజశేఖర్ రెడ్డి నివాసం ఉంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మారుణాయుధాలతో దాడికి పాల్పడి, హత్యాయత్నం చేశారన్నారు. ఇవాళ ఉద‌యం సంఘటన స్థలానికి పుట్టపర్తి సిఐ కొండారెడ్డి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, బాధితున్ని వైద్యం నిమిత్తం ఆస్పత్రిలో చేర్చి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement