Thursday, May 9, 2024

Flash.. Flash: క‌ర్నూలులో దారుణం.. క‌త్తులు, రాడ్ల‌తో అటాక్‌.. వీధి వ్యాపారిని చంపేందుకు ప్లాన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం క‌ర్రూలు జిల్లాలో దారుణం జ‌రిగింది. ఈ రోజు (శ‌నివారం) రాత్రి చికెన్ బండి వీధి వ్యాపారిపై కొంత‌మంది దుండ‌గులు క‌త్తుల‌తో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. నంద్యాల సంజీవనగర్‌లో చికెన్ బండి వ్యాపారిపై దుండగులు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో హిమాన్స్ అనే వ్యాపారి తీవ్రంగా గాయపడ్డాడు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వ్యాపారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, హిమాన్స్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుటుంబకలహాలే ఈ దాడికి కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తు చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement