Friday, May 3, 2024

అనకాపల్లి జిల్లాలో దారుణం .. ఆరేళ్ల బాలిక‌పై అత్యాచారం

ఆరేళ్ల బాలిక‌పై ఓ వ్య‌క్తి అత్యాచారానికి పాల్ప‌డిన దారుణ‌ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పక్కింటిలో ఉండే సాయి అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న చిన్నారిని తల్లిదండ్రులు గుర్తించారు. ఎవరో లాకెళ్ళి ఇంతటి దారుణానికి పాల్పడ్డారని బాలిక చెబుతోంది. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement