Sunday, April 28, 2024

AP: అనంత‌పురం జిల్లాలో దారుణం… భ‌ర్త‌ను గొడ్డ‌లితో న‌రికి చంపిన భార్య‌….

భ‌ర్త‌ను ఓ భార్య గొడ్డ‌లితో నరికి చంపింది. ఈఘ‌ట‌న అనంత‌పురం జిల్లా పెద్ద‌ముస్తూర్‌లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. భర్త వేధింపులు భరించలేక భార్య గొడ్డలితో కిరాతకంగా దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన భర్త ఓబులేసు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement