Sunday, May 5, 2024

Breaking: ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

కర్నూలు నగరంలోని సంతోష్ నగర్ కాలనీలో గల లోకాయుక్త కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. లోకాయుక్త కార్యాలయంలోని బాత్రూంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. సత్యనారాయణ మెడికల్ లీవ్ లో ఉండి.. శుక్రవారమే విధుల్లోకి చేరారు. అంతలోనే ఆత్మహత్యకు చేసుకోవడంపై అనుమానాలకు తావిస్తుంది. అతని తండ్రి పోలీస్ అధికారిగా పనిచేసి పదవి విరమణ చేశారు.

కర్నూలు నాలుగో పట్టణ సీఐ శంకరయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన సత్యనారాయణకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు కారణాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక కారణాలా, మరి ఏ ఇతర కారణాలనే అంశంపై పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement