Monday, April 29, 2024

అప్పన్నకు కాసుల పంట.. రెండు రోజుల్లో రూ.3.05 కోట్లు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో : దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీ నృసింహస్వామికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం లభించింది. అప్పన్న చందనోత్సవం నేపధ్యంలో ఈ భారీ ఆదాయం లభించినట్లు ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆలయ ఇవో వి.త్రినాధరావు ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి స్వచ్ఛంద సంస్థల సహకారంతో లెక్కించారు. రెండు రోజులకు గాను రూ.3,05,44,183 కోట్లు ఆదాయం లభించింది. ఇక బంగారం, వెండి , విదేశీయ డాలర్లు పెద్ద మొత్తంలో భక్తులు సమర్పించారు. 29 రోజులకు ఈ ఆదాయం లభించినట్లు ఆలయ ఇవో త్రినాధరావు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement