Thursday, May 16, 2024

AP – బూతులు మాట్లాడే వారికి బుద్ధి చెప్పాలి – వెంకయ్యనాయుడు

విశాఖపట్నం – బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్ లో బుద్ధి చెప్పండని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు యువతకు పిలుపు ఇచ్చారు. ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ, పార్లమెంట్ లలో కొంతమంది అపహస్య పనులు చేస్తున్నారని, ఆ చర్యలను చూడకుండా ప్రశాంతంగా ఉండాలని వెంకయ్య నాయుడు హితవు పలికారు. రాజకీయ నాయకులు స్థాయి మరచి చౌకబారు మాటలు మాట్లాడకూడదని, ఈ మధ్య కాలం లో రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్నారని, ఇలాంటివారికి పోలింగ్ బూత్ లో సమాధానం చెప్పాలని విద్యార్థులకు సూచించారు.

చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యమని ..మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని …మాతృభాష కళ్ళు లాంటిదని, పరాయి భాష కళ్లద్దాల్లాంటిదని వెంకయ్య నాయుడు అభివర్ణించారు. విలువలతో కూడిన విద్య ఉంటే, విలువలు కలిగిన పౌరుడిగా తయారవుతారని, నేడు విలువలతో కూడిన విద్య తగ్గుతోందని..ఇది మంచిది కాదని, .విలువలతో కూడిన విద్య ను అందించడానికి అందరూ కృషి చేయాలని ఆయన ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. .దేశంలోని మేధాశక్తి కారణంగానే ప్రపంచం యావత్తు భారతదేశం వైపు చూస్తోందని, భగవంతుడు ఏం కావాలంటే మళ్ళీ విద్యార్థి దశకు తీసుకువెళ్లాలని కోరుకుంటానని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement