Sunday, April 28, 2024

TS RTC : క‌త్తిపూడి హైవేపై ఆర్టీసీ బ‌స్సు బోల్తా..

కాకినాడ – కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రభుత్వం చోటు చేసుకుంది. టీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. డ్రైవర్ భాస్కరరావుకు బీపీ డౌన్ కావడంతో బస్సుపై ఆయన నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న కరెంట్ పోల్ ను ఢీకొని పల్టీ కొట్టింది.

ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులున్నారు. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విష‌యం తెలుసుకున్న అన్నవరం ఎస్సై కిశోర్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్ష‌త‌గాత్రుల‌ను, డ్రైవ‌ర్ ను చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement