Thursday, May 2, 2024

ఏపీ-తెలంగాణ‌ స‌రిహ‌ద్దుల్లో మ‌ళ్లీ వాహ‌నాల రాక‌పోక‌లు షురూ..

ఆంక్ష‌లు స‌డ‌లిస్తూ  తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఈ రోజు ఉద‌యం నుంచి సరిహద్దుల్లో వాహనాలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా నడువనున్నాయి. లాక్‌డౌన్ నేప‌థ్యంలో తెలంగాణ‌-ఏపీ స‌రిహ‌ద్దుల్లో ఇటీవ‌ల వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురైన విష‌యం తెలిసిందే. అయితే,  బస్సులు పూర్తి స్థాయిలో నడుస్తాయని తెలంగాణ ప్ర‌భుత్వం ప్రకటించినప్పటికీ  అంతర్రాష్ట్ర బస్సుల విష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. దీంతో వాటి రాక‌పోక‌ల‌పై ప్ర‌జ‌ల్లో సందేహాలు ఉన్నాయి.లాక్‌డౌన్ విధించ‌డంతో హైద‌రాబాద్ నుంచి ఏపీలోని సొంతూళ్ల‌కు వెళ్లిన జ‌నాలు తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement