Sunday, April 28, 2024

AP : ఎపి స‌చివాల‌యం తాక‌ట్టు.. జ‌గ‌న్ పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం..

ఎపి స‌చివాలయాన్ని తాక‌ట్టు పెట్ట‌డం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్నితాకట్టు పెట్టాడ‌మేన‌ని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టు పెట్టడమేంటని ట్విట్టర్ వేదికగా జ‌గ‌న్ ను ఆయ‌న నిలదీశారు. జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది భవనాలను కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్నని తీవ్రంగా విమర్శించారు.

సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను జగన్ నాశనం చేశారని ఆరోపించారు. ఈ అసమర్థ, అహంకార పాలనలో కోల్పోతున్న వాటిపై ఆంధ్రులు ఆలోచన చేయాలని చంద్రబాబు కోరారు.
జగన్ చేస్తున్న అప్పులతో ఆర్థికవేత్తలు కూడా షాక్: లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ను మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. జగన్ చేస్తున్న అప్పులు చూసి ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని రూ.12.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్.. చివరకు సెక్రటేరియట్ ను కూడా వదలలేదని మండిపడ్డారు. పీకలలోతు అప్పుల్లో మునిగిపోయిన శ్రీలంక కూడా తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదని లోకేశ్ చెప్పారు. జగన్ పనితనాన్ని చూశాక రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చడం కూడా సరికాదని అనిపిస్తోందన్నారు. ఇంతకంటే దిగజారలేరని అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు దిగిపోతూ జగన్ ఏపీ పరువును మంటగలుపుతున్నారని లోకేశ్ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement