Thursday, May 2, 2024

ఏపీలో కొత్తగా 528 కేసులు

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,339 సాంపిల్స్ ని పరీక్షించగా 528 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. కరోనాతో కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 1864  మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9470 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 23,15,030 కేసులు నమోదు కాగా.. ఇందులో 22,90,853 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 14707 మంది కరోనాతో మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement