Thursday, April 25, 2024

Ranji match : అద్భుత సెంచ‌రీతో ఆక‌ట్టుకున్న య‌శ్ ధూల్

భారత అండర్-19 జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ యశ్ ధూల్ ఈరోజు రంజీల్లో అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్లో తొలి రంజీ మ్యాచ్ ఆడుతున్న యశ్ ధూల్ ఢిల్లీ తరఫున బరిలో దిగాడు. తమిళనాడుపై సెంచరీ సాధించి జాతీయస్థాయిలో ఆకట్టుకున్నాడు. ఎలైట్ గ్రూప్-హెచ్ లో భాగంగా నిర్వహిస్తున్న ఈ మ్యాచ్ గువాహటిలో జరుగుతోంది. ఓపెనర్ గా బరిలోకి దిగిన యశ్ ధూల్ మొత్తం 150 బంతులు ఆడి 113 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 18 బౌండరీలు ఉన్నాయి. కెరీర్ తొలి రంజీ మ్యాచ్ లోనే శతకంతో సత్తా చాటడం పట్ల సోషల్ మీడియాలో అతడిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. యశ్ ధూల్ టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ అవుతాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. బీసీసీఐ కూడా అతడిని అభినందించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement