Tuesday, May 14, 2024

AP: జగనన్న విద్యా దీవెన పథకం వాయిదా

ఏపీలో ఈరోజు నిర్వ‌హించాల్సిన జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కం వాయిదా ప‌డింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు డబ్బులు పడాలి. అయితే, ఈ కార్యక్రమం వాయిదా పడింది. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు విజయవాడలో నిర్వ‌హించ‌నున్న‌ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జగనన్న విద్యా దీవెన పథకం వాయిదా పడింది. పథకం అమలు తేదీని త్వరలోనే ప్రకటించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement