Tuesday, April 30, 2024

బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం చేయలేదు.. లోకేశ్ కామెంట్స్ పై పోలీసులు సీరియస్

బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కోరారు. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, ఇలాంటి వార్తల వల్ల బాలిక కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉందన్నారు. పోక్సో చట్టం ప్రకారం బాలికలకు సంబంధించిన కేసుల్లో వారి వివరాలు బహిర్గతం చేసినా, తప్పుడు ప్రచారం చేసినా వారిపైనా అదే చట్టం ప్రకారం కేసు నమోదు చేయవచ్చన్నారు.  బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అయితే, తాను బాధిత బాలిక తల్లిదండ్రులతో మాట్లాడానని, చిన్నారిపై అత్యాచారయత్నం జరగలేదని వారు చెప్పారని పేర్కొన్నారు. కానిస్టేబుల్ తమ కుమార్తెతో చనువుగా వ్యవహరిస్తుండడంతో మందలించి ఫిర్యాదు చేసినట్టు వారు చెప్పారని ఎస్పీ వివరించారు.

మరోవైపు కానిస్టేబుల్ రమేశ్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేసిన ఆరోపణలు సరికాదని ఏపీ పోలీసు అధికారుల సంఘం పేర్కొంది. ఈ ఘటనను లోకేశ్ రాజకీయంగా వాడుకోవడాన్ని తాము ఖండిస్తున్నట్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. లోకేశ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement