Sunday, April 28, 2024

AP – వాహనం ఢీకొని చిరుత పులి మృతి

ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా) – ఎమ్మిగనూరు సమీపంలో వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. రహదారిపై రోడ్ మీద వెళ్తున్న చిరుత పులిను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో పులి అక్కడికి అక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పులి మృతదేహానికి పంచనామా నిర్వహించారు.గత కొన్ని రోజులుగా ఎమ్మిగనూరు పరిధిలోని గుడికల్ , కోసిగి, చుట్టూ పరిసర గ్రామ కొండల్లో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ చిరుతను పట్టుకొని అడవి శాఖ అధికారులు తరలించారు. ఇప్పుడు అదే కొండల సమీపంలో జాతీయ రహదారిపై చిరుతను వాహనం ఢీకొనడంతో మృతి చెందడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement