Tuesday, April 30, 2024

AP – తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో స్పల్ప భూప్రకంపనలు

ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో స్పల్పంగా భూప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, ఓజిలి, దొరవారిసత్రం, పెళ్లకూరు మండలాలలో స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి

తిరుపతి జిల్లాలోని దొరవారిసత్రంలో భూమి కంపించింది. రెండు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఈ భూప్రకంపనలపై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement