Saturday, April 27, 2024

మంత్రి అదిములపుకు చుక్కెదురు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు !

ఏపీ విద్యా శాఖ మంత్రి అదిములపు సురేష్ దంపతులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు.. సిఆర్పిసి ప్రకారం ప్రాథమిక విచారణ అవసరం లేదని పేర్కొంది. ప్రాథమిక విచారణ చేసిన తర్వాతే కేసు నమోదు చేయాలనే హక్కు నిందితుడికి లేదని జస్టిస్ చంద్ర చుడ్ ధర్మాసనం తీర్పు ప్రకటించింది. ఇక ఈ కేసులో ప్రాథమిక విచారణ జరపకుండా సిబిఐ కేసు నమోదు చేయడంపై ఆదిమూలపు దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆదిమూలపు దంపతుల వాదనను హైకోర్టు సమర్థించింది. దీంతో హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో ఆదిమూలపు సురేష్ దంపతుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: శబరిమల యాత్రపై కేరళ సర్కారు మార్గదర్శకాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement