Saturday, May 18, 2024

Srisailam: మల్లన్న సేవలో ఏపీ మంత్రి శంకర్​ నారాయణ

శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సోమవారం రాత్రి ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీశైల మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు కుటుంబ సమేతంగా వచ్చిన మంత్రి శంకర్ నారాయణకు అర్చకస్వాములు, ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదంతో ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శనం చేయించారు. అంతకుముందు శ్రీశైలం భ్రమరాంబ అతిథి గృహానికి విచ్చేసిన మంత్రి శంకర్ నారాయణకు దేవస్థాన ఈవో లవన్న స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement