Tuesday, April 30, 2024

AP – గీతాంజ‌లికి రూ.20 ల‌క్ష‌ల న‌ష్ట ప‌రిహారం..ప్ర‌క‌టించిన జ‌గ‌న్

తాడేప‌ల్లి – తెనాలి యువతి గీతాంజలి విపక్షాల ట్రోలింగ్ కారణంగానే బలవన్మరణం చెందిందంటూ అధికార వైసీపీ తీవ్ర ఆరోపణల నేప‌థ్యంలో సీఎం జగన్ స్పందించారు. గీతాంజలి ఆత్మహత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ మేర‌కు ఎపి సిఎంవో కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న నేడు విడుద‌ల చేసిది.. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు.. ఆడపిల్లల గౌరవ ప్రతిష్ఠలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని జగన్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement