Thursday, May 23, 2024

ఏపీ విద్యార్థులు అలర్ట్.. ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే..

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్ పరీక్షలను కచ్చితంగా నిర్వహించి తీరుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ రెండో వారం నుంచి నిర్వహించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పరీక్షల షెడ్యూల్‌ను ఒకటి,రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

మార్చిలోగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని సమాచారం. అలాగే ప్రీఫైనల్ పరీక్షలను ఈనెల 21 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కాగా, గతేడాది ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పాస్ చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement