Friday, May 17, 2024

AP: ధర్మవరంలో హై టెన్ష‌న్‌.. జేసీబీల‌తో షాపుల తొల‌గింపు

Anantapuram: ధర్మవరం టౌన్‌లోని వెజిటెబుల్‌ మార్కెట్‌లో షాపుల‌ తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఈరోజు తెల్లవారుజామున పోలీసుల భారీ బందోబస్తు మధ్య మునిసిపాలిటీ అధికారులు జేసీబీలతో మార్కెట్‌లోని దుకాణాల తొలగింపు ప్రారంభించారు.

దీంతో మార్కెట్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో కొత్తగా మార్కెట్ భవనాల నిర్మాణం కోసం పురపాలక శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని వ్యాపారులకు నోటీసులు ఇచ్చింది.

డిపాజిట్ చెల్లించని వ్యాపారుల దుకాణాలను తొలగించాలని నిర్ణయించుకున్న అధికారులు జేసీబీలతో 40కిపైగా దుకాణాలను తొలగించారు. రెండు దుకాణాలకు సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడంతో వాటిని పక్కనపెట్టి మిగతా వాటిని తొలగించారు.

మరోవైపు, తాము అంతమొత్తంలో డిపాజిట్ చెల్లించలేమంటూ వ్యాపారులు ఆందోళనకు దిగగా, టీడీపీ నేతలు వారికి మద్దతుగా నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యాపారులతోపాటు ఆందోళనకు దిగిన టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement