Sunday, April 28, 2024

ప్రజలకు వేగవంతంగా న్యాయం అందించేందుకు కృషి :హైకోర్టు చీఫ్ జస్టిస్

ప్రజలకు వేగవంతంగా న్యాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. బుధవారం నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ పి.కె.మిశ్రా మాట్లాడుతూ కరోనా పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రజలకు సత్వర న్యాయసేవలు అందించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు,మహిళలు,చిన్నారులు వంటి వారికి న్యాయసేవలు అందించడం ప్రాధాన్యతగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని జస్టిస్ పికె మిశ్రా అన్నారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాణాలతో కూడిన న్యాయ వ్యవస్థ మనదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.సామాన్యునికి న్యాయ సేవలను సకాలంలో అందించేందుకు వీలుగా న్యాయస్థానాలు విశేష చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.గత రెండేళ్ళుగా కరోనా పరిస్థితులు తలెత్తినా హైబ్రిడ్,వర్చువల్ విధానాలు ద్వారా ప్రజలకు న్యాయసేవలు అందించేందుకు అన్ని విధాలా కృషి జరుగుతోందని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ చేసి పౌరులకు అందించడమే గాక ప్రపంచ దేశాలకు అందించడంలో కూడా మన దేశం ప్రపంచానికే న్యాయకత్వం(గ్లోబల్ లీడర్ షిప్పు)వహిస్తోందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement