Thursday, May 16, 2024

ఢిల్లీ పర్యటనలో ఏపీ గవర్నర్.. ప్రధాని, రాష్ట్రపతితో భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీ పర్యటన చేపట్టారు. శుక్రవారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. సోమవారం వరకూ ఇక్కడే ఉండనున్న గవర్నర్ పలువురు కేంద్ర పెద్దలతో సమావేశమయ్యే అవకాశముంది. నేటి(శనివారం) ఉదయం 10.30గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమవుతారు. ఈ పర్యటనలో ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో గవర్నర్ పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement