Thursday, May 2, 2024

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు..

ఏపీలో 16 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీ, పదోన్నతిని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు. విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారికి డీఐజీగా పదోన్నతి కల్పించి దిశా డీఐజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కృష్ణా, తూర్పుగోదావరి ఎస్పీలను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. విజయనగరం ఎస్పీ రాజకుమారికి డీఐజిగా పదోన్నతి కల్పించారు. ఆమెను దిశా డీఐజీగా ప్రభుత్వం నియమించింది, దీంతోపాటు డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ డీఐజీగాను బాధ్యతలు అప్పగించారు.

విజయనగరం ఎస్పీగా ఎం.దీపికను నియమించారు. రైల్వే ఎస్పీగా ఉన్న సీహెచ్ విజయరావును నెల్లూరు ఎస్పీగా బదిలీ చేశారు. కృష్ణ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబును తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ హస్మిని గ్రే హౌండ్స్ కమాండర్​గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సిద్ధార్థ్ కౌశల్​ను కృష్ణా జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. వై.రిశాంత్ రెడ్డిని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ అడ్మిన్​గా పోస్టింగ్ ఇచ్చారు.

ఇక ఎస్ .సతీష్ కుమార్​ను స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా నియమించారు. విద్యాసాగర్ నాయుడును ఎస్ఈబీ అదనపు ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. గరికపాటి బిందు మాధవ్​ను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. తుహిన్ సిన్హాను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. పి. జగదీష్​ను విశాఖపట్నం జిల్లా, పాడేరు ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. జి కృష్ణకాంత్​ను తూర్పుగోదావరి జిల్లా, చింతూర్ ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. వి ఎన్ మణికంఠ ఛందోలును విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు. కృష్ణకాంత్ పాటిల్​ను తూర్పుగోదావరి జిల్లా, రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు. తుషార్ దూడిని విశాఖపట్నం జిల్లా, చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు.

ఇది కూడా చదవండి: నేడు కేంద్ర కేబినెట్ విస్తరణ..

Advertisement

తాజా వార్తలు

Advertisement