ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనకు విశ్వమంతటా అభిమానులున్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు వేడుకలను ఘనంగా జరుపు కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులు సైతం కేసీఆర్కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేసి అభిమానాన్ని చాటుకుంటున్నారు. రైతు బాంధవుడిగా తెలంగాణ రైతులకు విశిష్ట సేవలందిస్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు తూర్పు గోదావరి జిల్లా కడియం రైతులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కడియపులంక గ్రీన్ లైఫ్ నర్సరీలో కూరగాయలు, మొక్కలు, పువ్పులతో సీఎం కేసీఆర్ చిత్రాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital