Thursday, May 2, 2024

కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు వెంటనే చెక్ పవర్ ఇవ్వాలి: అయ్యన్న పాత్రుడు

ఏపీలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు వెంటనే చెక్ పవర్ ఇవ్వాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో కరోనా తో పాటు జ్వరాలు వేధిస్తున్నాయని దీనికి ప్రధాన కారణం కలుషిత తాగు నీరేనని అన్నారు. సర్పంచ్ లకు చెక్ పవర్ ఇస్తే ఇలాంటి సమస్యల పరిష్కారానికి వీలుంటుంది. ఈ సమస్యపై సీఎంతో మాట్లాడేందుకు ఎమ్మెల్యేలకు భయమని..అందుకే సర్పంచులంతా సంఘంగా ఏర్పడి వారి సమస్యలు పరిశీలించుకోవాలని సూచించారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన 15 వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే గ్రామాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement