Thursday, April 25, 2024

పెన్షన్ నిధిని ఒకేసారి విత్‌డ్రా చేసుకునే అవకాశం

పెన్షన్ నిధి విత్​డ్రా నిబంధనల్లో కీలక మార్పులు చేసేందుకు ఈపీఎఫ్‌వో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబ అత్యవసరాల కోసం లేదా అధిక రాబడులు ఇచ్చే సాధానాల్లో మదుపు చేసేందుకు.. పదవీ విరమణ పొందిన వ్యక్తులు తమ పెన్షన్​ నిధి మొత్తాన్ని ఓకే సారి విత్​డ్రా చేసుకునేందుకు త్వరలో అనుమతులు లభించే అవకాశం ఉంది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం భారత భవిష్యనిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎన్​పీఎస్ నుంచి​ విత్​ డ్రాపై రూ.2 లక్షల వరకు పరిమితి ఉంది. ఇది కాకుండా మొత్తం పెన్షన్​ నిధిలో 60 శాతం మాత్రమే విత్​డ్రా చేసుకునేందుకు వీలుంది. 40 శాతం ఫండ్​ కచ్చితంగా ప్రభుత్వ అనుమతులున్న యాన్యుటీల్లో ఉండాల్సిందే. కొత్త విధానం ద్వారా రూ.5 లక్షల వరకు పెన్షన్​ నిధి ఉన్న సబ్​స్క్రైబర్లు ఆ మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకునేందుకు అవకాశం కలగనుంది.విత్​డ్రా ప్రణాళికలో మార్పులు వచ్చినప్పటికీ.. సబ్​స్క్రైబర్లు తమ పెన్షన్​ డబ్బును కొంత ప్రభుత్వ అనుమతులున్న యాన్యుటీల్లో, లేదా పెన్షన్​ ఫండ్ మేనేజర్లతో మదుపు చేయించే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement