Friday, May 3, 2024

AP: క్రిస్టియన్ కార్పొరేష‌న్ ఎండీగా ఎలీషా నియామ‌కం

ఒం గోలు ( ప్రభన్యూస్‌) : ప్రకాశం జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరెక్టర్‌గా పని చేసిన ఎలీషా సోమవారం స్టేట్‌ క్రి స్టియన్ కార్పొరేష‌న్ మేనేజింగ్‌ డెరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో పని చేసిన సమయంలో ఆయన డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు.

ఆయన ఉద్యోగ బాధ్యతల్లో నిబద్దతతో పని చేస్తుండటంతోనే ప్రభుత్వం ఎలీషాను క్రిష్టియన్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. ఈ సందర్భంగా డీఆర్‌డీఏ ప్రాజెక్టు మేనేజర్‌ డేవిడ్‌, ఇతర ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement