Tuesday, May 7, 2024

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం 5 వరకు..

ఏపీలో కరోనా నియంత్రణకు విధించిన కర్ఫ్యూను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ఉదయం గం.6 నుంచి సాయంత్రం గం.6 వరకూ పెంచారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ను కఠినంగా అమలు చేయనున్నారు. వ్యాపార దుకాణాలను ఐదింటికే మూసివేయాల్సి ఉంటుంది.  ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలు ఇకపై ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా కేసులు ఎక్కువ వున్న తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కర్ఫ్యూ సడలింపును మధ్యాహ్నం గం.2 వరకే ఇచ్చారు. దానికి అనుగుణంగా ఆ ఒక్క జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల పని వేళల్ని ఉదయం గం.8.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు ఇవే పని వేళలు వర్తిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement