ఏపీ నుంచి వచ్చే కొవిడ్ రోగులను అనుమతించడం లేదు తెలంగాణ పోలీసులు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్గేట్ వద్ద తెలంగాణ పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కరోనా రోగులతో వస్తున్న అంబులెన్స్లను అడ్డుకుని, వాటిని వెనక్కి పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరోనా రోగులకు తెలంగాణలోకి అనుమతించట్లేదని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఇతర వాహనాలను మాత్రం పోలీసులు అనుమతిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement