Monday, April 29, 2024

ఏపీలో తగ్గని కరోనా ఉధృతి..

ఏపీ క‌రోనా రోజువారి కరోనా కేసులు అస్సలు తగ్గడం లేదు. ప్రతిరోజు స్థిరంగా 15 వందలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో నిన్న 1557 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,12,123కి చేరింది. ఇందులో 19,83,119 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,179 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 18 మంది మృతిచెందిన‌ట్టు ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది. దీంతో ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 13,825కి చేరింది. ఇక‌పోతే, గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో 1213 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. చిత్తూరులో 255, తూర్పు గోదావ‌రిలో 232, కృష్ణాజిల్లాలో 159, నెల్లూరులో 164, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 212 కేసులు న‌మోద‌య్యాయి.

ఇది కూడా చదవండి: నాగార్జున బర్త్ డే… తనయుల స్పెషల్ విషెస్

Advertisement

తాజా వార్తలు

Advertisement