Wednesday, May 1, 2024

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..

ఏపీలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. డచిన 24 గంటల్లో 59,641 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,546 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,70008కు చేరింది. మరోవైపు 1968మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,36016 మంది కరోనా నుంచి బయటపడ్డారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 416 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 229, ప్రకాశం జిల్లాలో 201 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో పోరాడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స 15 మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 5గురు మృతి చెందగా, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 13,410కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,582 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇది కూడా చదవండి: స‌చివాల‌యంలో ఆర్థికశాఖ ఉద్యోగుల నిరసన..

Advertisement

తాజా వార్తలు

Advertisement