ఏపీ సిఎం జగన్ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు.
ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి బంజారాహిల్స్లోని కేసీఆర్ నివాసానికి జగన్ చేరుకుంటారు. గంటపాటు అక్కడే ఉండి మధ్యాహ్నానికి తాడేపల్లి చేరుకుంటారు.