Thursday, May 2, 2024

బీజేపీకి ఓటు వేయండి.. రూ.50కే క్వార్టర్ లిక్కర్: ఏపీ బీజేపీ చీఫ్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి అధికారం ఇస్తే నాణ్యమైన మద్యం క్వార్టర్ సీసాను రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం లిక్కర్ ను అధిక ధరలపై ప్రజలకు విక్రయిస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని నాసిరకం బ్రాండ్లనూ అధిక ధరలకే విక్రయిస్తున్నట్టు చెప్పారు. అందరికీ తెలిసిన ప్రముఖ బ్రాండ్లు మాత్రం లభించవన్నారు.

రాష్ట్రంలో మద్యం తీసుకునే ప్రతి వ్యక్తి లిక్కర్ కోసం నెలలో రూ.12,000 చొప్పున ఖర్చు చేస్తున్నారని సోము వీర్రాజు చెప్పారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వారికే ఏదో ఒక పథకం రూపంలో ఇస్తోందన్నారు. రాష్ట్రంలో కోటి మంది మద్యపానం సేవిస్తున్న సోము వీర్రాజు.. ఆ కోటి మంది 2024లో బీజేపీకి ఓటు వేయాలన్నారు. అప్పుడు ఒక్క క్వార్టర్ సీసాను రూ.75కే మొదట్లో ఇస్తామని, ఆదాయం మెరుగుపడిన తర్వాత రూ.50కే విక్రయిస్తామని సోము వీర్రాజు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement