Friday, May 3, 2024

ఐదురోజులు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు-17 అంశాలపై చర్చించేందుకు టీడీపీకి అనుమ‌తి

స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన బీఏసీ స‌మావేశం ముగిసింది. ఈ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్..మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్.. చీఫ్ విఫ్‌ శ్రీకాంత్‌రెడ్డి, విప్ ప్రసాద్‌రాజులు పాల్గొన్నారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ ప్రస్తావించిన 17 అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.ఐదురోజులు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కాగానే ఈ మధ్యకాలంలో కన్నుమూసిన సభ్యులకు ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పులపర్తి నారాయణమూర్తి, జేఆర్‌ పుష్పరాజ్‌, నల్లమిల్లి మూలారెడ్డి మృతి పట్ల సభ్యులు సంతాపం ప్రకటించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement